Saturday 25 January 2014

Pulastya Maharshi



పులస్త్య మహర్షి
          విష్ణువు నాభినుంచ్ఛి బ్రహ్మ జన్మించాడు. బ్రహ్మ కుడి చెవినుంచి పులస్త్యుడు ఉద్భవించాడు. ఆయన చిన్నప్పటి నుంచి సత్వగుణంలో ఉండి తపస్సు చేసుకొనేవాడు. తపశ్శక్తితో అపర శివుడుగా కన్పించేవాడు. యుక్తవయస్సు రాగానే కర్ధమ ప్రజాపతి కుమార్తె హవిర్భువును వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఒక కుమారుడు పుట్టాడు కాని అతను మరణించాడు.
        తరువాత కొన్నాళ్లకు సర్వసంగ పరిత్యాగియై పులస్త్యుడు తృణబిందుని ఆశ్రమంకు వెళ్లి అక్కడ తపస్సు చేయసాగాడు.  అక్కడ ఖౌచర, గంధర్వ కిన్నెరాంగులు వచ్చి విచ్చలవిడిగా విహరిస్తున్నారు.  దాంతొ ఆయన తపస్సుకి భంగం కలిగి వారిని మరో ప్రదేశంకు వెళ్లమని చెప్పినా వినలేదు.  ఆ భాద భరించలేక పులస్త్యుడు ఓ కన్యలారా ఈ రోజు నుంచి నా కంటబడినవారు గర్భవతులౌతారు అని చెప్పాడు.
          అది విని వారు భయంతో వెళ్లిపోయారు. ఒక రోజున తృణబిందుడనే రాజు కుమార్తె తన చెలికత్తెలతో వన విహారం చేస్తూ తెలియక పులస్త్యుని వద్దకు వచ్చి ఆయన ముఖం చూచింది.
          ఆమె గర్భవతి అయింది. ఆశ్చర్యపడి నేను అవివాహితను, అందరూ నవ్వుతారు ఇది నా తండ్రికి అపకీర్తి,  నేనిచ్చటకు వచ్చిన వేళావిశేషమా అని పలురకాలుగా ఆలోచించి తండ్రి దగ్గరకు వెళ్లి జరిగినది చెప్పింది. ఆ రాజర్షి దివ్యదృష్టితో చూచి కుమార్తెను తీసుకొని పులస్త్యుని వద్దకు వెళ్లి జరిగింది చెప్పి వివాహం చేసుకోమన్నాడు.
          పులస్త్యుడు ఆమెను వివాహం చేసికొని అన్యోన్యంగా జీవిస్తున్నారు. కొన్నాళ్లకు ఆమెకు కుమారుడు జన్మించాడు. ఆ బిడ్డకి విశ్వవసు అనిపేరు పెట్టి పెంచుకున్నారు. అతనికి యుక్తవయస్సు రాగానే దేవకర్ణి అనే ఆమెను పెళ్లి చేసుకొని ఆమె ద్వారా కుబేరుని కన్నాడు.
          పులస్త్యుడు కైకసి అనే కన్యను వివాహం చేసుకొని ఆమె ద్వారా రావణ, కుంభకర్ణ, విభీషణ, శూర్పణఖలను కన్నాడు. వారు పెద్దవారు అయ్యాక రావణుడు బలగర్వంతో కార్తవీర్యార్జునితో యుద్ధంచేసి ఓడిపోయాడు. అతనిని ఖైదు చేశారనే వార్త తెలిసి పులస్త్యుడు వెంటనే వెళ్లి మనుమని చెరనుండి విడిపించాడు. భీష్ముడు పులస్త్యుని వద్దకు వచ్చి పుణ్య తీర్ధముల గురించి చెప్పమని కోరాడు.
          పులస్త్యుడు భీష్మా నీ కోరిక పుణ్యఫలమైనది. గర్వములేనివారు, అల్పభోజనులు, నిత్య సంతోషితులు, సత్యవ్రతులు, ధర్మతత్పరులు, శాంతిస్వభావులు, క్షమామూర్తులు, సర్వతీర్ధముల సేవాఫలితంను యజ్ఞం చేసిన ఫలం‍నూ పొందుతారు.  అనేక పుణ్య తీర్ధములున్నవి అన్నియు చూడదగినవే. కాని, శుచి లేనివారు తీర్ధయాత్రలు చేసినా ఫలితం దక్కదు. నీవు సర్వతీర్ధములు దర్శించి అభీష్టసిద్ధిని పొందమని ఆశీర్వదించి పంపారు.

No comments:

Post a Comment